న్యూఢిల్లీ: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ General ( Bipin rawat ) దంపతులకు మిలిటరీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖలు నివాళులర్పించారు. చివరిగా త్రివిధ దళాలకు చెందిన అధిపతులు అంటే ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే, ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ బిపిన్ రావత్కు దంపతులకు ఘనంగా నివాళులు అర్పించినట్లు అధికారులు తెలిపారు. వారి భౌతిక కాయాలపై పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు. అనంతరం బిపిన్ రావత్కు గౌరవ వందనం సమర్పించారు.
జనరల్ బిపిన్ రావత్ దంపతులు ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం ఈ నెల 8న తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి కొండల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వాళ్లిద్దరితోపాటు మరో 11 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పాయారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది.