న్యూఢిల్లీ: సివిల్ సర్వెంట్లు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత కానీ, పదవీ విరమణ పొందిన తర్వాత కానీ నిర్ణీత కాలంపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండానిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్కు అనుమతి ఇచ్చింది. దీని కోసం సరైన అధికార వ్యవస్థను ఆశ్రయించవచ్చునని తెలిపింది.
మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో, సివిల్ సర్వెంట్లు పదవీ విరమణ లేదా రాజీనామా చేసిన వెంటనే ఏదైనా రాజకీయ పార్టీ ఇచ్చే టికెట్పై చట్ట సభలు లేదా శాసనసభ లేదా పార్లమెంటుకు పోటీ చేయడాన్ని నిరోధించే విధంగా ఎన్నికల కమిషన్కు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.