న్యూఢిల్లీ, ఆగస్టు 12: కోర్టు ప్రాంగణాల్లో కాల్పుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీలు, లాయర్లు, కోర్టు సిబ్బంది, పిటిషన్దారుల భద్రత ముప్పులో పడుతుందని పేర్కొన్నది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ప్రాంగణా ల్లో ఎక్కువమంది గుమికూడకుండా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టుల వద్ద భద్రత పెంచాలని, ఇందుకు సంబంధించి తీసుకొన్న చర్యలపై రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని పేర్కొన్నది. జిల్లా కోర్టుల్లో సీసీటీవీల నిఘా ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్వర్వులను రాష్ర్టాలు ఉల్లంఘించాయంటూ పిటిషన్ దాఖలైంది.