న్యూఢిల్లీ : చిరుధాన్యాలపై రూపొందించిన ‘అబ్డెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాటకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పోషకాల సమృద్ధి అంటూ పాటను రచించి, ప్రదర్శించిన ముంబయి గాయని, గేయ రచయిత ఫాల్గునీ షా, ఆమె భర్త గౌరవ్ షా ప్రపంచ ప్రఖ్యాత ‘గ్రామీ అవార్డు’కు నామినేట్ అయ్యారు. 2023ను ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ఐరాస ప్రకటించింది. దీనిని పాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు పాటను రూపొందించారు.