ఇంఫాల్: అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో పరిస్థితి సద్దుమణుగుతున్నది. చురచాంద్పూర్, ఇంఫాల్ వెస్ట్, థౌబల్, జిరిబమ్ జిల్లాల్లో మంగళవారం నాలుగు గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. చాలా జిల్లాల్లో 144 సెక్షన్, మే 13 వరకు మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేత కొనసాగుతున్నది.
అల్లర్లలో 60 మంది మరణించారని, 231 మంది గాయపడ్డారని, 1,700 ఇండ్లు దహనమయ్యాయని సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. భద్రతాదళాల నుంచి 1,041 ఆయుధాలను, 7,460 మందుగుండు సామగ్రిని లాక్కెళ్లారు. 35,655 మంది మణిపూర్ను వీడారు. ఇంఫాల్ ఎయిర్పోర్టులో 2,000 మంది పడిగాపులు కాస్తున్నారు.