న్యూఢిల్లీ: అమెరికా ఆరోపిస్తున్నట్టుగా న్యూయార్క్లో ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రలో ప్రమేయం ఉన్న అధికారులను భారత ప్రభుత్వ దర్యాప్తులో గుర్తించినట్టు బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది. అయితే వీరికి ప్రభుత్వ అనుమతి లేదని సంబంధిత అధికారులు తెలిపినట్టు పేర్కొన్నది. ఈ కుట్రలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు ప్రస్తుతం నిఘా ఏజెన్సీ ‘రిసెర్చ్ అండ్ అనాలసిక్ వింగ్(రా)’లో పనిచేయడం లేదని, అయితే అతను ప్రభుత్వ ఉద్యోగిగానే ఉన్నాడని తెలిపింది.