న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరికి లోక్సభ ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 7న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చింది. అదో రోజు మౌఖిక సాక్ష్యం ఇవ్వడానికి డానీష్ అలీ కూడా రావాలంది.
కాగా, ఇంతకుమందు ఆదేశాలు జారీ చేసినా బిధూరి కమిటీ ముందు హాజరు కాలేదు. చంద్రయాన్-3 విజయవంతాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో సభ్యులందరి సాక్షిగా అలీపై బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో స్పీకర్ దానిని ప్రివిలేజ్ కమిటీకి పంపారు.