శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా ఏరియాలోని హసన్పొరా లొకాలిటీలో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో అలీ మహమ్మద్ అనే హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో తోటి పోలీసులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
కాగా, పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నది. భారత ఆర్మీ సిబ్బంది, స్థానిక పోలీసులు సంయుక్తంగా హసన్పొరాలో అణువణువూ క్షుణ్ణంగా గాలిస్తున్నారు.