Heart Attack | న్యూఢిల్లీ, డిసెంబర్ 7: 2021తో పోలిస్తే 2022లో గుండెపోటు మరణాలు 12.5 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2022లో 32,547 మంది గుండె పోటు కారణంగా మరణించారని తెలిపింది. కొవిడ్ వ్యాధి వల్ల గుండె పనితీరు బలహీనంగా ఉండటం ఈ మరణాలకు ఒక కారణమని చెప్పింది.
2022లో 56,450 హఠాత్తు మరణాలు సంభవించాయని, ఆ ఏడాదికి ముందు మూడేండ్లతో పోలిస్తే హఠాత్తు మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపింది. హింస వల్ల కాకుండా ఇతర ఏ కారణాల వల్లనైనా(ఉదాహరణకు గుండెపోటు, మెదడులో రక్తస్రావం) నిమిషాల వ్యవధిలో మరణం సంభవిస్తే ఆ మరణాన్ని హఠాత్తు మరణంగా పరిగణిస్తామని తెలిపింది.