న్యూఢిల్లీ: దేశం పేరును ఇండియా అని, భారత్ అని, హిందుస్థాన్ అని పిలుచుకుంటున్నారు. తమిళులు భారత అని, మలయాళీలు భారతం అని తెలుగువారు భారతదేశం అని అంటున్నారు. దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 (1)లో ‘ఇండియా, అనగా భారత్, రాష్ర్టాల యూనియన్’ అని పేర్కొంటున్నది. భారత రాజ్యాంగం దేశానికి ఇండియాగాను, భారత్గాను అధికార, చట్టబద్ధమైన పేర్లను ఇచ్చింది. రాజ్యాంగాన్ని రూపొందించిన నాటి ముసాయిదా కమిటీ.. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు పేర్లను ఎంపిక చేసింది.