న్యూఢిల్లీ, జూలై 29: తండ్రిని కోల్పోయిన బిడ్డకు తల్లి మాత్రమే సంరక్షకురాలిగా ఉంటుందని, ఆ బిడ్డ ఇంటిపేరు నిర్ణయించే పూర్తి అధికారం ఆమెకే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. భర్త చనిపోయాక ఓ మహిళ మరో పెండ్లి చేసుకున్నది.
రెండో భర్త ఇంటిపేరును మొదటి భర్త ద్వారా కలిగిన బిడ్డ పేరుకు ముందు పెట్టుకునేలా అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. రెండో భర్త పేరును బాలుడి రికార్డుల్లో ‘స్టెప్ ఫాదర్’గా పేర్కొనాలన్న ధర్మాసనం ఆదేశాలను క్రూరమైన చర్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది.