ఇంఫాల్ : జాతీయ పౌరుల రిజిస్టర్(ఎన్ఆర్సీ)ని తమ రాష్ట్రంలో అమలు చేయాలని మణిపూర్ శాసన సభ శుక్రవారం మరోసారి తీర్మానం చేసింది. రాష్ట్ర భద్రత, సమగ్రతలను కాపాడేందుకు ఎన్ఆర్సీ అమలును వేగవంతం చేయాలని 2022 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం బీరేన్ సింగ్ ఈ విషయమై ఎక్స్లో పోస్ట్ చేశారు.
మణిపూర్ ప్రయోజనాలను కాపాడేందుకు, దేశ క్షేమం కోసం ఎన్ఆర్సీని అమలు చేయడం చాలా ముఖ్యమని తాము దృఢంగా విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న తరాల కోసం మణిపూర్ను సౌభాగ్యవంతంగా, పటిష్ఠంగా తీర్చిదిద్దడానికి తాము కృషి చేస్తున్నామని, దీనికి ప్రజలంతా మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.