చెన్నై: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్నా..దళితులు కుల వివక్షకు గురవుతున్నారంటే..మనమంతా సిగ్గుతో తలదించుకోవాలి..అంటూ మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటరానితనం కొనసాగుతుంటే న్యాయస్థానం మౌన ప్రేక్షకుడిగా ఉండలేదని పేర్కొన్నది.
పుదుక్కోైట్టె జిల్లా మంగళనాడు గ్రామంలో దళితులపై అంటరానితనం కొనసాగుతున్నదని దాఖలైన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దళితులను శ్రీమంగళ నాయకి అమ్మన్ దేవాలయంలోకి ప్రవేశించకుండా పెత్తందారీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి అడ్డుకుంటున్నాడని పిటిషన్దారు ఆరోపించారు.