న్యూఢిల్లీ: భారతీయ కుటుంబాలు అధికంగా మత సంస్థలకు విరాళాలు ఇస్తున్నాయని తాజా సర్వే పేర్కొన్నది. 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో దాదాపు 75 శాతం విరాళాలు మతపరమైన సంస్థలకే వెళ్లాయట.భారతీయ కుటుంబాలు అధికంగా మత సంస్థలకు విరాళాలు ఇస్తున్నాయని తాజా సర్వే పేర్కొన్నది. 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో దాదాపు 75 శాతం విరాళాలు మతపరమైన సంస్థలకే వెళ్లాయట.
ఈ మేరకు అశోక యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ పిలాంత్రపీ(సీఎస్ఐపీ) ‘హౌ ఇండియా గివ్స్’ పేరుతో నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది కాలంలో భారతీయ కుటుంబాలు దాదాపు రూ.27 వేల కోట్లు విరాళాలు అందజేశాయని, ఇది గత ముందటి ఏడాది కంటే 14 శాతం ఎక్కువని తెలిపింది.