శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున తమిళనాడులో నేటి నుంచి ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనలు నిలిపేస్తున్నట్లు థియేటర్ల యజమానులు ప్రకటించారు.
ది కేరళ స్టోరీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా దేశవ్యాప్తంగా వివాదస్పదమైంది. మే 6న రిలీజ్ అయిన ఈ సినిమాకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.
ఈ సినిమా విడుదల నేపథ్యంలో తమిళనాడులో నామ్ తమిళార్ కట్చి(NTK) పార్టీ ఆందోళనలు చేపట్టింది. ‘ది కేరళ స్టోరీ’ విడుదల పట్ల నిరసన తెలుపుతూ సినిమాను నిషేధించాలనే నినాదాలతో ధియేటర్లలోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ‘ది కేరళ స్టోరీ’ ప్రదర్శిస్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందని, సాధారణ జనం నుంచి కూడా ఆదరణ అంతంతమాత్రంగానే ఉండటం వల్ల ఈ సినిమాను నిలిపేస్తున్నట్లు ధియేటర్ల యాజమానులు తెలిపారు. మరోవైపు తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శించడం వల్ల అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే.