బెంగళూరు: అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు కర్ణాటక సర్కార్ రూ.12 లక్షల్ని క్లియర్ చేయకుండా అవమానిస్తున్నది. మైసూర్ మహారాజు జయచామరాజేంద్ర ఒడెయార్ 14.5 అడుగుల శిల్పాన్ని 2016లో యోగిరాజ్ రూపొందించా రు.
ఆయన కళానైపుణాన్ని గుర్తిస్తూ ఆనాటి కర్ణాటక ప్రభుత్వం రూ.12లక్షలు ఇస్తామని ప్రకటించింది. విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 8 ఏండ్లు దాటినా పారితోషికం మాత్రం అరుణ్ యోగిరాజ్కు ప్రభుత్వం చెల్లించలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ తాజాగా సోషల్మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు.