న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత గగనతల పరిశోధన, రక్షణ సామర్థ్యాల పెంపులో కీలక ముందడుగు పడింది. ఐఐటీ, కాన్పూర్ దేశంలోనే మొట్టమొదటి హైపర్వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని నిర్మించి విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష విజయంతో అధునాతన హైపర్సానిక్ టెస్టింగ్ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ నిలిచింది. ఎస్2 అని పిలిచే ఈ సదుపాయానికి జిగర్తాండ అనే మారుపేరు కూడా ఉన్నది.
ఇది 3 నుంచి 10 కిలోమీటర్ల మధ్య విమాన వేగాన్ని ఉత్పత్తి చేయగలదు. వాహనాలు, గ్రహశకలాల ప్రవేశాన్ని, స్క్రామ్జెట్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణుల వాతావరణ ప్రవేశ సమయంలో ఉత్పన్నమయ్యే హైపర్సానిక్ పరిస్థితులను ఇది కల్పిస్తుంది. గగన్యాన్, ఆర్ఎల్వీ, హైపర్సానిక్ క్రూయిజ్ క్షిపణులతో సహా ఇస్రో, డీఆర్డీవోలో కొనసాగుతున్న ఎన్నో మిషన్లకు ఇది ఎంతో ఉపయోగపడనున్నది. ఈ సౌకర్యం ఐఐటీ కాన్పూర్లోని ఏరో డైనమిక్స్ ల్యాబ్లో ఉన్నది.