న్యూఢిల్లీ, డిసెంబర్ 21: భారత సాయుధ దళాల చేతికి త్వరలో ‘ప్రళయ్’ బాలిస్టిక్ క్షిపణి అందనున్నది. 150-500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగల ఈ క్షిపణి కొనుగోలు ప్రతిపాదన తుది దశలో ఉన్నదని, దీనిని ఈ వారంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ఆమోదం కోసం తీసుకురానున్నట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మక ఆపరేషన్ల కోసం ఈ క్షిపణిని వినియోగించనున్నారు. సరిహద్దులో చైనా దురాక్రమణ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.