న్యూఢిల్లీ: ఆవు, గేదె పాలు అమ్మినట్టు మార్కెట్లో ‘తల్లి పాలు’ అమ్మకానికి పెట్టడానికి వీల్లేదని ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికారిక సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) హెచ్చరించింది. తల్లి పాలను ప్రాసెస్ చేసి అమ్మినా, ఉత్పత్తులను తీసుకొచ్చినా చట్ట ప్రకారం నేరమని తెలిపింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈమేరకు రాష్ర్టాలకు అడ్వైజరీ జారీచేసింది. హ్యూమన్ మిల్క్ను ప్రాసెస్ చేయటానికి, అమ్మకానికి ఎలాంటి అనుమతులూ మంజూరు చేయరాదని రాష్ర్టాలకు సూచించింది. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.