మీరట్: సంప్రదాయ సామాజిక వైఖరికి భిన్నంగా యూపీలోని మీరట్కు చెందిన ఓ మాజీ జడ్జి కుటుంబం విడాకులను మౌనంతో కాకుండా వేడుకలా జరుపుకొంది. బాధితురా లి న్యాయవాదుల కథనం ప్రకారం.. ప్రణీత వశిష్టకు ఓ ఆర్మీ మేజర్తో 2018లో పెండ్లి జరిగింది. కొన్ని రోజులకే అత్తింటి వారు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించ డం మొదలుపెట్టారు. ప్రణీతకు ఒక కొడుకు జన్మించిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. దీంతో ఆమె విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. ఈ నెల 4న విడాకులు మంజూరయ్యాయి.
దీంతో కోర్టు నిర్ణయాన్ని ఆమె కుటుంబం ‘కొత్త ప్రారంభానికి’ సూచికగా భావించి దాన్ని వేడుకగా జరపాలనుకున్నది. ప్రణీత కోర్టు నుంచి బయటకు రాగానే ఆమెను మేళతాళాలతో ఊరేగింపుగా ఇంటి వరకు తీసుకెళ్లింది. ‘వివాహ జీవితంలో సంతోషంగా లేని నా కూతురిని ఆ వాతావరణం నుంచి బయటకు తీసుకురావడం నా బాధ్యత. నేను అదే చేశాను’ అని ప్రణీత తండ్రి శర్మ తెలిపారు. తన కు టుంబ సాయంతో తాను తిరిగి నిలదొక్కుకోగలిగానని బాధితురాలు పేర్కొన్నారు. ‘పెండ్లి చేసుకోవాలనుకొనే ముందు మిమ్మల్ని మీరు చైతన్యపరుచుకోండి, స్వతంత్రంగా ఉండండి‘ అని ప్రణీత మహిళలకు సందేశమిచ్చారు.