Train | యూపీలో ఓ వింత జరిగింది. షాజహాన్పూర్ స్టేషన్లో బాలామావూ ప్యాసింజర్ ఆగింది. చాలా సేపు ఇలాగే ఆగిపోయింది. ఏం జరిగిందో ప్రయాణికులకు అసలు అర్థం కావడం లేదు. తర్వాత తెలిసింది ఏమిటంటే.. డ్రైవర్కు రాత్రి సరిగ్గా నిద్రలేదట. అందుకే ట్రైన్ను నడపడానికి ఆ డ్రైవర్ నిరాకరించాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే దాదాపు మూడున్నర గంటల ఆలస్యంగా ఈ రైలు షాజహాన్పూర్ స్టేషన్కు చేరుకుంది. ఈ డ్రైవరే తిరిగి ఈ ట్రైన్ను బాలామావూకు తీసుకెళ్లాల్సి వుంది. రాత్రి ఆలస్యంగా వచ్చిన కారణంగా ఆ డ్రైవర్కు నిద్ర కరువైంది. ఉదయం 7 గంటలకే బాలామావూకు వెళ్లడానికి ఆయన నిరాకరించారు. కంటి నిండా నిద్ర అయిన తర్వాతే తాను ట్రైన్ను నడిపిస్తానని డ్రైవర్ తెగేసి చెప్పేశాడు.
ఈ ఘటనపై షాజహాన్పూర్ రైల్వే అధికారి అమరేంద్ర గౌతమ్ స్పందించారు. రోజా జెంక్షన్లో రాత్రి డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటారని, ఆ తర్వాత ట్రైన్ను తిరిగి తీసుకెళ్తాడని వివరించారు. అయితే రాత్రి సరిగ్గావిశ్రాంతి లేని కారణంగా ఉదయం ఆ ట్రైన్ను తీసుకెళ్లడానికి డ్రైవర్ నిరాకరించారని తెలిపారు. కంటి నిండా నిద్ర అయిన తర్వాతే ఆ డ్రైవర్ తిరిగి ట్రైన్ను నడిపించాడు. దీంతో రెండున్నర గంటల పాటు ప్రయాణికులు అలాగే ఉండిపోయారు.