చండీగఢ్, జూలై 8: అటవీ అధికారుల నియామకాల్లో మహిళా అభ్యర్థుల చాతీ కొలవాలన్న బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అటవీ రేంజర్, డిప్యూటీ రేంజర్, ఫారెస్టర్ అధికారుల నియామకాలకు ఈ నెల 12 నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో మహిళల చాతీని కొలవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది తుగ్లక్ చర్య అని కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలా విమర్శించారు. సీఎం ఖట్టర్ ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పి క్రూరమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.