Transplantation | న్యూఢిల్లీ, జూన్ 27: అందం, ఆకర్షణీయమైన గడ్డం కోసం ట్రాన్స్ప్లాంట్ సర్జరీలకు ఈమధ్యకాలంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గడ్డం ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు చేపడుతున్నట్టు కోల్కతాలోని ప్రభుత్వ దవాఖాన ‘ఎస్ఎస్కేఎం’ (సేత్ సుఖ్లాల్ కర్నానీ మెమోరియల్) ప్రకటించింది. చెల్లించాల్సిన ఫీజు, పాటించాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఎస్ఎస్కేఎం దవాఖాన వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.
చెంపలు, దవడ భాగంలో మార్కింగ్తో ఈ ప్రక్రియ మొదలవుతుందని, ఎస్ఎస్కేఎం ప్లాస్టిక్ సర్జరీ వైద్యుడు అరిందమ్ సర్కార్ చెప్పారు. పూర్తిస్థాయిలో గడ్డం రావడానికి మూడు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ రాకపోతే, సర్జరీ అంతా కూడా రూ.50 వేలల్లో పూర్తవుతుందని చెప్పారు.