న్యూఢిల్లీ, ఆగస్టు 5: దోషులు, అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్, జీవ నమూనాలను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) చట్టం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి దర్యాప్తు ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయడానికే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్-1920 స్థానంలో ఈ బిల్లు తీసుకొచ్చినట్టు కేంద్రం చెబుతున్నది. ఈ బిల్లుకు ఏప్రిల్లోనే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఈ చట్టంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులకు ఈ చట్టం ద్వారా డీఎన్ఏ, నమూనాలు సేకరించే విషయంలో అపరిమిత అధికారాలు సంక్రమించనున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.