న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మంగళవారం ‘డైపర్ విరాళాల ప్రచారం’ చేపడుతున్నట్లు ప్రకటించింది.
ఎక్స్ వేదికగా సీజేపీ తమ మద్దతుదారులంతా ధర్నాకు డైపర్లు తీసుకురావాలని, ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ దానిపై రాయాలని కోరింది. ‘డైపర్ ఏ డే కీప్ లీక్స్ అవే’ అనే ఈ ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.