లక్నో: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార మంత్రిత్వ శాఖ వెన్నెముక అని కేంద్ర హోంశాఖ, సహకార మంత్రి అమత్ షా అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల చుట్టూ ఉన్న 8.55 లక్షల ప్రభుత్వ కమిటీలు మారుమూల ప్రాంతాల ప్రజలను కలుపుతూ పని చేస్తున్నాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో యూపీ కోఆపరేటివ్ బ్యాంక్ 13 కొత్త శాఖలు, 294 పీఏసీఎస్లు, సైబర్ సెక్యూరిటీ ఆఫ్ ఆపరేషన్ సెంటర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్కు చెందిన 26 గోడౌన్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. దేశంలోని 65,000 ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ (పీఏసీఎస్)లను ఒకే సాఫ్ట్వేర్తో కంప్యూటరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటిని జిల్లా, రాష్ట్ర సహకార బ్యాంకులతోపాటు నాబార్డ్తో కూడా అనుసంధానం చేస్తామని చెప్పారు. యూపీ వ్యవసాయ ఆర్థిక రంగానికి ఇది కొత్త ప్రారంభమని అమిత్ షా అన్నారు.