న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎయిర్పోర్టు సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు సౌదీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానించి తనిఖీ చేశారు. దాంతో అతని దగ్గర ఏకంగా లక్ష 20 వేల సౌదీ రియాల్లు లభించాయి. ఆ కరెన్సీ విలువ భారత కరెన్సీలో రూ.24 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
కాగా, నిందితుడు అక్రమంగా తరలిస్తున్న కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడిన ఘటనను మరువకముందే.. తాజాగా ఢిల్లీలో ఎయిర్పోర్టు విదేశీ కరెన్సీ పట్టుబడటం గమనార్హం.