న్యూఢిల్లీ: స్మో ర్ట్ఫోన్లలో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్లకు కళ్లెం వేయాలని కేంద్ర ఐటీ శాఖ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ యాప్లను తొలగించే అవకాశం వినియోగదారులకు ఉండేలా కొత్త నిబంధనలకు రూపకల్పన చేస్తున్నదని రాయిటర్స్ కథనం పేర్కొంది.
ప్రీ ఇన్స్టాల్డ్ యాప్లు అన్ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉండాలని, ప్రతి ఓఎస్ అప్డేట్ వినియోగదారులకు వెళ్లే ముందే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తించిన ల్యాబ్లో పరీక్షించేలా కొత్త నిబంధనలు ఉండనున్నట్టు తెలిపింది.