న్యూఢిల్లీ: భారత్లో విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) నిర్ణయించింది. విదేశీ చట్టాలు, వివిధ రకాల అంతర్జాతీయ న్యాయ సమస్యలు, మధ్యవర్తిత్వ వ్యవహారాల్లో విదేశీ న్యాయవాదుల ప్రాక్టీస్ను అనుమతించాలని నిశ్చయించింది.
ఈ నిర్ణయానికి అనుగుణంగా భారత్లో విదేశీ న్యాయవాదులు, న్యాయ సంస్థల రిజిస్ట్రేషన్, నియంత్రణకు బీసీఐ కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నిర్ణయంతో భారత్లోని న్యాయవాదులకు, విదేశీ న్యాయవాదులకు పరస్పర ప్రయోజనం చేకూరుతుందని బీసీఐ పేర్కొన్నది.