చెన్నై: కొన్ని రోజుల క్రితం తమ దేశ తీరంలో కనిపించిన వస్తువు భారత్కు చెందిన పీఎస్ఎల్వీ రాకెట్ శకలం అయి ఉంటుందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ సోమవారం అభిప్రాయపడింది. అయితే తన అభిప్రాయానికి గల ఆధారాలను ఆ సంస్థ వెల్లడించలేదు. నిజ నిర్ధారణ కోసం ఇస్రోతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని ఇస్రో వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
మిస్టరీ వస్తువు కనిపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్రో అది తమదేనని లేదా తమది కాదనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మిస్టరీ వస్తువు చిత్రాలను బట్టి అది పాత కాలం నాటి రాకెట్ భాగమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.