Arvind Kejriwal | న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా నిరాహారదీక్షకు దిగాలని ఆమ్ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. భారత్ సహా కెనడా, యూకే, యూఎస్ తదితర దేశాల్లోని భారతీయులు దీక్ష చేయనున్నారని ఆప్ నేతలు చెప్పారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరస్టై జైల్లో ఉన్న ఆప్ నేత, మనీష్ సిసోడియా జ్యూడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. సిసోడియాకు ఇదివరకు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు పూర్తవ్వటంతో ఆయన్ను కోర్టు ముందు హాజరు పర్చారు.