న్యూఢిల్లీ: నియాన్డెర్తాల్ మానవులు, హోమో సెపియన్లతో లైంగిక సంపర్కం జరిపినప్పుడు పుట్టిన పిల్లల జన్యువుల్లో మార్పులు సంభవించాయని, దీంతో నియాన్డెర్తాల్స్లో అంతకుముందు లేని రక్త సంబంధిత వ్యాధులు తలెత్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాధులే నియాన్డెర్తాళ్లు కనుమరుగు కావడానికి కారణం కావొ చ్చన్నారు. ఇలా వ్యాధులతో పుట్టిన పిల్లలకు, వారి నుంచి మరోతరానికి వ్యాధులు సంక్రమించాయన్నారు.