న్యూఢిల్లీ: థాయిలాండ్ మాజీ ఆర్మీ చీఫ్(Ex Army Chief) ప్రవిత్ వోంగ్సువాన్.. ఓ మహిళా జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. ఓ ప్రశ్న అడిగిన సమయంలో.. ఆయన ఆ రిపోర్టర్ తలపై కొట్టారు. 79 ఏళ్ల వోంగ్సువాన్. పలాంగ్ ప్రచారథ్ పార్టీకి చెందిన నేత. కొత్త ప్రధాని పెటాంగ్టార్న్ శినవత్ర గురించి ఆ జర్నలిస్టు ప్రశ్న వేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన గురించి దర్యాప్తు చేపట్టనున్నట్లు థాయిలాండ్ పార్లమెంట్ తెలిపింది.
ఈ ఘటనకు చెందిన వీడియోను ప్రస్తుతం ఎక్స్ అకౌంట్లో అప్లోడ్ చేశారు. మహిళా జర్నలిస్టును డాంగ్తిప్ యంపోగా గుర్తించారు. ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా.. మాజీ ఆర్మీ చీఫ్ ఆమె తలపై పదేపదే కొట్టారు. 2000 దశకం ఆరంభంలో థాయ్ ఆర్మీ చీఫ్గా చేశారాయన. 2014లో జరిగిన సైనిక కుట్రలో ఆయన్ను కీలక వ్యక్తిగా భావిస్తారు. మిలిటరీ నేతృత్వంలోని ఏర్పడిన ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ ప్రధానిగా చేశారు.
ఆన్లైన్లో వీడియో వైరల్ కావడంతో.. మాజీ ఆర్మీ చీఫ్ క్షమాపణలు చెప్పారు. కేవలం ఆమెను టీజ్ చేసినట్లు చెప్పారు. తనకు ఎటువంటి దురుద్దేశం లేదన్నారు.
A politician is surrounded by journalists while walking down a corridor when one of them asks him a question.
■ Instead of answering it, he raises his hand and slaps her in the head several times before climbing into his vehicle and driving away.
■ Videos of this interaction in… pic.twitter.com/WjYw7CZtWa— Stephen Mutoro (@smutoro) August 21, 2024