అయోధ్య: వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామ మందిరంలో జరుగనున్న రాముని ప్రాణ ప్రతిష్ఠ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామాలయ ట్రస్టు 7 వేల మందికి ఆహ్వానాలు పంపింది.
వీరిలో సచిన్ టెండూల్కర్, కోహ్లీ, అమితాబ్ బచ్చన్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తదితర ప్రముఖులు ఉన్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు బుధవారం తెలిపారు. సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు కూడా ఉన్నారని చెప్పారు.