ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జరిమానాకు గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా మహీపై రూ.12లక్షల ఫైన్ పడింది. నిర్ణీత సమయంలో చెన్నై జట్టు ఓవర్లు పూర్తి చేయనందు వల్ల ఈ చర్యలు తీసుకున్నట్టు ఐపీఎల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ చేతిలో చెన్నై ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.