జైపూర్: రాజస్థాన్లో ఆలయం కూలిన ఘటనలో ఓ మహిళకు గాయాలు అయ్యాయి. కరౌలీలో ఉన్న శివాలయం కూలడంతో.. ఆ శిథిలాల కింద ఓ మహిళ చిక్కుకున్నది. శివాలయం వద్ద జేసీబీతో పనులు చేపడుతున్నారు. కాలువ కోసం తొవ్వకాలు జరుపుతున్న సమయంలో.. ఆ జేసీబీ ఆలయ గోడలకు తగిలింది. అయితే ఆ సమయంలో గుడిలో పూజలు చేస్తున్న ఓ మహిళ ఆలయ శిథిలాల కింద చిక్కుకుపోయింది.