హైదరాబాద్ : రక్షాబంధన్ను పురస్కరించుకొని ప్రధాని మోదీకి తెలుగు విద్యార్థిని సాయి మధుమిత రాఖీ కట్టారు. దేశంలోని పాఠశాలల నుంచి హాజరైన వంద మంది విద్యార్థుల్లో తెలుగు రాష్ర్టాల నుంచి సాయి మధుమిత ఒక్కరే ఉన్నారు. ప్రధానికి స్వయంగా రాఖీ కట్టే అవకాశం రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
కాగా మధుమిత ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన డాక్టర్ బీ నాథ్ అండ్ టీఆర్ రావు మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో 12వ తరగతి(ఎంబైపీసీ) చదువుతున్నారు.