న్యూఢిల్లీ: బాలల లైంగిక వేధింపుల కంటెంట్కు సంబంధించిన 2,114 గ్రూపులు, చానెళ్లను నిషేధించినట్టు ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ శనివారం వెల్లడించింది. బాలలపై లైంగిక వేధింపుల సమాచారాన్ని భారత్లోని తమ వేదికల్లో వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.
నిబంధనలను ఉల్లంఘిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద ఆయా సంస్థలకు కల్పిస్తున్న రక్షణను ఉపసంహరించుకొంటామని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు. నోటీసులపై స్పందించిన టెలిగ్రామ్.. చట్టపరమైన, నైతిక విలువలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నది.