తెలంగాణ టూరిజం ప్రత్యేక బస్సులు
అందుబాటులో మొత్తం 30 ప్యాకేజీలు
ఇతర రాష్ర్టాలనూ చూసొచ్చే అవకాశం
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల్లో రాష్ట్రంలోని, దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించాల నుకొనేవారికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. ఈ ప్యాకేజీలకు భారీ డిమాండ్ కనిపిస్తున్నది. తెలంగాణ నుంచి తిరుపతి, షిర్డీకి ప్రతిరోజూ బుకింగ్లు జరుగుతున్నాయి. తిరుపతికి నాలుగు, షిర్డీకి ఒకటి, యాదాద్రికి రెండు నుంచి నాలుగు బస్సులు రోజూ నడుస్తున్నాయి. తెలం గాణలోని పర్యాటక ప్రాంతాలను చూడాలనుకునే వారి కోసం 16 ప్యాకేజీలు, ఇతర రాష్ర్టాలను చుట్టేసి రావాలనుకొనేవారి కోసం 14 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని పర్యాటకా భివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ప్రాంతాలకు
హైదరాబాద్ సైట్ సీయింగ్, రామోజీ ఫిలింసిటీ, నిజాం ప్రాంతాలు, బాసర, టెంపుల్ టూర్, టెంపుల్ కమ్ వైల్డ్లైఫ్ టూర్, కొండ ప్రాంతాల సందర్శన, కాకతీయ టూర్, శ్రీశైలం-సోమశిల- రివర్టూర్, నాగార్జునసాగర్, కొమురవెల్లి-వేములవాడ-కొండగట్టు, కాళేశ్వరం వన్డే టూర్, బొగత జలపాతం, పాపికొండలకు ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. ఆయా టూర్లను బట్టి ఒక్కొక్కరికి కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.4,000 వరకు చార్జీలు వసూలు చేస్తారు. ఇతర రాష్టాలకు సంబంధించిన ప్యాకేజీలలో తిరుమల-తిరుపతి-తిరుచానూర్-కాణిపాకం-శ్రీనివాసమంగాపురం-కపిలతీర్థం, దరాబాద్-షిర్డీ, హైదరాబాద్-షిర్డీ-అజంతా-ఎల్లోరా, హైదరాబాద్-ఊటీ-బెంగళూరు, హైదరా బాద్-బెంగళూరు-ఊటీ- మైసూర్, హైదరాబాద్-అరకు, హైదరాబాద్-గోవా, 14 రోజుల సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నా యి. ఎంచుకొనే టూర్ను బట్టి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అద్దె బస్సులు
వేసవిలో బంధువులు, స్నేహితులతో కలిసి టూర్ వెళ్లాలనుకొనే వారికి పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సులను అద్దెకు ఇస్తున్నది. హైదరాబాద్లో ఉండేవారైతే పికప్ అండ్ డ్రాపింగ్ సదుపాయం కల్పి స్తుంది. పూర్తి వివరాలకు తెలంగాణ పర్యాటకశాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.