Tejaswi Surya | మతం మారిన వారి విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని బెంగళూరు ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ప్రకటించారు. ఈ విషయంపై సోమవారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘ఉడుపి శ్రీకృష్ణ మఠంలో రెండు రోజుల క్రితం హిందూ పునరుజ్జీవనం పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేను మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. దీంతో నేను ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను’ అని తేజస్వీ సూర్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఉడుపి శ్రీకృష్ణ మఠంలో జరిగిన కార్యక్రమంలో తేజస్వీ సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాల రీత్యా భారత దేశ చరిత్రలో కొందరు హిందువులు మతం మారారు. వారందర్నీ తిరిగి హిందూమతంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం అన్ని మఠాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.’ అని తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు.