న్యూఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ వివాహం ఢిల్లీకి చెందిన రాచెల్ గోడిన్హోతో గురువారం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోని సైనిక్ ఫామ్స్లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెండ్లి వేడుకకు ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దంపతులు, రాజ్యసభ ఎంపీ మిసా భారతి వంటి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లికూతురు రాచెల్ను ఇకపై రాజేశ్వరి యాదవ్గా పిలుస్తారు.
మంగళవారం రాత్రి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో తేజస్వీ, రాచెల్ నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరికీ ఏడేండ్లకుపైగా పరిచయం ఉన్నది. లాలూ ప్రసాద్, రబ్రీదేవీల సంతానంలో తేజస్వీ యాదవ్ చివరి వ్యక్తి. ఆయనకు ఏడుగురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉండగా వారందరికీ వివాహాలు జరిగాయి.