పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీది అదృశ్య అభివృద్ధి రాజకీయమని విమర్శించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్ దర్భంగా గురించి ప్రస్తావించడంపై దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమది అభివృద్ధి రాజకీయాలని కేంద్ర మంత్రి మాండవ్య అన్నారు. ఎయిమ్స్ దర్భంగా నిర్మాణానికి అనువైపు భూమిని అందించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న తేజస్వీ యాదవ్ను కోరారు.
కాగా, తేజస్వీ యాదవ్ దీనిపై స్పందించారు. ‘ఎయిమ్స్ కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా స్థలాన్ని ఖరారు చేయలేదు. అయినప్పటికీ ప్రధాని మోదీ అక్కడ ఎయిమ్స్ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇది ఎలాంటి అదృశ్య అభివృద్ధి రాజకీయం?’ అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి మాండవ్య ఎక్స్లో స్పందించారు. 2020లో ఎయిమ్స్ దర్భంగాకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. నిర్మాణం కోసం 2021లో బీహార్ ప్రభుత్వం భూమి ఇచ్చిందన్నారు. అయితే బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై రాజకీయం చేస్తూ 2023లో ఆ స్థలాన్ని మార్చారని అన్నారు.
మరోవైపు తేజస్వీ యాదవ్ దీనిపై స్పందించారు. మీరు వివరించిన కాలం నుంచి చాలా ఏండ్ల వరకు బీహార్ ఆరోగ్య మంత్రి బీజేపీకి చెందినవారని గుర్తు చేశారు. మీరు బహుశా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
प्रिय तेजस्वी जी,
मोदी सरकार विकास में राजनीति नहीं करती बल्कि विकास की राजनीति करती है।
हमारी नीयत साफ़ है।
एम्स दरभंगा की अनुमति मोदी सरकार ने 19 सितंबर 2020 को दी थी और बिहार सरकार ने 3 नवंबर 2021 को पहली ज़मीन दी। https://t.co/ESOxhfeDp6 pic.twitter.com/kH0PiucDml
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) August 12, 2023