‘రా’ చీఫ్ పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ, జూన్ 24: ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి తపన్కుమార్ దేకా శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(ఆర్ఏడబ్ల్యూ) చీఫ్ సమంత్ గోయల్ పదవీ కాలాన్ని ఇంకో ఏడాది పొడిగిస్తున్నట్టు మరో ఆర్డర్లో పేర్కొన్నది.
ప్రస్తుతం ఐబీ చీఫ్గా ఉన్న అర్వింద్కుమార్కు ఇప్పటికే పొడిగించిన పదవీ కాలం ఈనెల 30తో ముగియనున్నది. అర్వింద్ పదవీ విమరణ తర్వాత తపన్కుమార్ నిఘా విభాగం చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేండ్లపాటు ఈ పదవిలో ఉం టారు. తపన్కుమార్ దేకా ప్రస్తు తం ఐబీ ఆపరేషన్స్వింగ్ బాధ్యతలు చూస్తున్నారు.