చెన్నై, డిసెంబర్ 19: భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాన్ని స్టాలిన్ ప్రభుత్వం బహిష్కరించింది. వరదల సందర్భంగా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ చేపడుతున్న రక్షణ, సహాయ కార్యక్రమాలపై సమీక్షించడానికి గవర్నర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని రాజ్భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
బాధిత ప్రాంతాల్లో బలగాలను దించి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, అవసరమైతే తాను కేంద్రంతో మాట్లాడి అదనపు సిబ్బందిని తెప్పిస్తానని గవర్నర్ సమావేశంలో హామీనిచ్చారు. ఇటీవల పలు అంశాలలో గవర్నర్, అధికారంలోని డీఎంకే ప్రభుత్వం మధ్య కోల్డ్వార్ నడుస్తున్న క్రమంలోనే గవర్నర్ సమీక్షా సమావేశానికి అధికారులెవ్వరూ హాజరు కాలేదని తెలుస్తున్నది.