Covid-19 | ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా సహా పలు దేశాలు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 కారణంగా వణికిపోతున్నాయి. ఈ కొత్త వేరియంట్ భారత్లోనూ వెలుగుచూసింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటికే పలువురిలో ఈ వేరియంట్ బయటపడింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రయాణికుడికి ఆయా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో టెస్టులు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా చైనా నుంచి వచ్చిన తమిళనాడు సాలెంకు చెందిన 37 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. సదరు వ్యక్తి ఓ బిజినెస్మెన్.. ఇటీవల చైనా వెళ్లిన అతను బుధవారం సింగపూర్ మీదుగా కోయంబత్తూర్ చేరుకున్నాడు. అక్కడ విమానాశ్రయంలో టెస్ట్ చేయగా పాజిటివ్గా తేలినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.