చెన్నై: తమిళనాడుకు చెందిన బీజేపీ నేత(BJP leader) సూర్యను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అతను నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడు. తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సూర్య కొనసాగుతున్నాడు. మధురైలో శానిటేషన్ వర్కర్ మరణంపై తన ట్వీట్లో ఫేక్ వార్తను ఆయన పోస్టు చేశారు. పారిశుధ్ధ్య కార్మికుడి మృతి పట్ల ఎంపీ వెంకటేశన్ మౌనంగా ఉన్నారంటూ కూడా తన ట్వీట్లో బీజేపీ నేత విమర్శలు చేశారు. తమ నేతను అరెస్టు చేయడాన్ని బీజేపీ పార్టీ ఖండించింది. భావ స్వేచ్ఛను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఆరోపించారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఆ అరెస్టును ఖండించారు.