చెన్నై: 2022 ఏడాదికిగాను తమిళనాడు అసెంబ్లీ తొలి సెషన్ జనవరి 5న ప్రారంభం కానున్నది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం సోమవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి రోజు అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం గవర్నర్ RN రవి ప్రసంగించనున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో జనవవరి 5 నుంచి అసెంబ్లీని ప్రారంభించాలని గవర్నర్ ఆదేశించనట్లుగా పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 క్లాజ్ (1) ప్రకారం తనకు సిద్ధించిన అధికారాల మేరకు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా నేను.. 2022, జనవరి 5 నుంచి చెన్నై సెక్రెటేరియట్లోని అసెంబ్లీ చాంబర్లో సమావేశం కావాలని రాష్ట్ర అసెంబ్లీని ఆజ్ఞాపిస్తున్నాను అని గవర్నర్ RN రవి పేర్కొన్నట్లుగా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్లో ఉన్నది.