లుథియానా: ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించడంతో.. భారత్లోని లుథియానాలో ఉన్న కుట్టు మెషిన్ల పరిశ్రమపై ప్రభావం పడింది. ఆఫ్ఘన్లో చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల లుథియానాలో సుమారు 40 శాతం మేర కుట్టు మెషిన్ల ఉత్పత్తి పడిపోయింది. వాస్తవానికి కుట్టు మిషిన్లు, వాటికి సంబంధించిన భాగాలను లుథియానా పరిశ్రమలు ఎక్కువ శాతం ఆఫ్ఘనిస్తాన్కు ఎగుమతి చేస్తుంటాయి. ప్రతి ఏడాది ఆ వ్యాపారం వందల కోట్లల్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సుమారు 150 కోట్ల మేర వ్యాపారం దెబ్బతినున్నట్లు సీవింగ్ మెషిన్ డెవలప్మెంట్ క్లబ్ అధ్యక్షుడు జగ్బీర్ సింగ్ తెలిపారు.
గతంలో సుమారు 1200 కోట్ల మేర పాకిస్థాన్తో వ్యాపారం జరిగేది. అయితే ఆ దేశంతో వాణిజ్యం ఆగిపోయింది. దానికి బదులుగా ఆఫ్ఘనిస్తాన్లో కుట్టు మిషిన్ల వ్యాపారం జోరందుకున్నది. ఇటీవల కరోనా వేళ కూడా ఆఫ్ఘన్లో కుట్టు మిషిన్ల వ్యాపారం బాగానే సాగింది. కానీ తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంతో వాణిజ్యానికి బ్రేక్ పడింది. దుబాయ్లోనూ కుట్టు మెషిన్లకు డిమాండ్ ఉన్నా.. ఆ దేశంలో చైనా వ్యాపారం పెరిగిపోయింది. కానీ ఇప్పటికీ ఆఫ్ఘన్ పరిశ్రమ ఇండియా మీదే ఆధారపడి ఉన్నది.