న్యూఢిల్లీ: భారత్, తైవాన్ మధ్య ఈ ఏడాది డిసెంబర్ మొదట్లో ‘ఎంప్లాయిమెంట్ మొబిలిటీ’ ఒప్పందం జరిగే అవకాశం ఉన్నదని సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్కు చెందిన దాదాపు లక్ష మంది కార్మికులను తైవాన్ తన ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, దవాఖానల్లో నియమించుకోనున్నదని తెలిపాయి. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తైవాన్.. ఇతర దేశాల శ్రామికులను నియమించుకొనే ప్రణాళికలో ఉన్నది.