న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ ఆదివారం ఒక ప్రకటన చేస్తూ హెచ్1ఎన్1కు సంబంధించి ఎలాంటి కొత్త వేరియంట్ను గుర్తించ లేదని పేర్కొంది. హెచ్1ఎన్1 సహా కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా జ్వరం ఎక్కువగా స్వీయ పరిమితం కలిగి ఉంటుందన్నారు. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒంటి నొప్పులు ఈ వ్యాధి సాధారణ లక్షణాలు.
పిల్లలు, వృద్ధులు, అనూహ్య వైద్య పరిస్థితుల్లో ఉన్న వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీలో ఈ ఏడాది 2,300 ఇన్ఫ్లుయెంజా కేసులు నమోదు కాగా, అందులో శుక్రవారం నాటికి 1,777 హెచ్1ఎన్1 కేసులు ఉన్నాయి. ఇందులో 114 హెచ్1ఎన్1 కేసులు కేవలం గురువారమే నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.